సివిల్స్ అభ్యర్థులకు మరో రెండు అవకాశాలు
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసేందుకు గతేడాదితోనే అవకాశాలు (అటెంప్ట్స్) పూర్తయిన అభ్యర్థులకు ఈ ఏడాది నుంచి మరో రెండు సార్లు పరీక్షలు రాసే అవకాశం లభించనుంది. అన్ని కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిని బట్టి ఈ ఏడాది నుంచి రెండు అదనపు అవకాశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ మేరకు మంగళవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వెల్లడించింది.
0 comments:
Post a Comment