ఈ-కామర్స్ రంగంలో లక్ష జాబులు…!
ఈ-కామర్స్ సంస్థల్లో జాబుల జాతర స్టార్ట్ కానుంది. ఈ-కామర్స్ రంగంలో వచ్చే ఆరు నెలల్లో దాదాపు లక్ష మంది అవసరమని అంచనా. అందుకోసం రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. రిక్రూట్ మెంట్ కోసం ఇప్పటికే కన్సల్టింగ్ కంపెనీలకు ఈ-కామర్స్ సంస్థలు హైరింగ్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చాయని ‘ఇన్ హెల్ప్ లీడర్ షిప్ సొల్యూషన్స్’ కంట్రీ హెడ్ ప్రశాంత్ నాయర్ చెప్పారు. అన్ని ఆన్ లైన్ షాపింగ్ కంపెనీలు తమ బిజినెస్ ని పెంచుకోవడానికి ప్లాన్ చేస్తోండటంతో జాబ్స్ పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. అలాగే, 2009లో ఇండియాలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ రూ. 2 వేల కోట్లుగా ఉంటే ప్రస్తుతం రూ. 10 వేల కోట్లకు పైగా ఉంది. దాదాపు ఐదేళ్ళలో 30 శాతం వృద్ధి సాధించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా 8-10 శాతం గ్రోత్ సాధించింది.
0 comments:
Post a Comment