హైదరాబాద్ లో ‘గూగుల్’ పర్మినెంట్ క్యాంపస్…
హైదరాబాద్ కి మరింత ఐటీ కళ రానుంది. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సంస్థ హైదరాబాద్ లో తమ పర్మినెంట్ కాంపస్ ను ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా, ఈ క్యాంపస్ ను చాలా పెద్దగా నిర్మించడానికి రెడీ అయింది గూగుల్. దీనికి సంబంధించి త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ సంస్థ ‘ఎంఓయూ’ కుదుర్చుకోనుందని ఐటీ శాఖ సెక్రటరీ హర్ ప్రీత్ సింగ్ చెప్పారు. గూగుల్ సంస్థ కు ఇప్పటివరకు హైదరాబాద్ లో పర్మినెంట్ క్యాంపస్ లేదని, అందుకోసం ఆ సంస్థ ప్రతిపాదనలు చేసిందని చెప్పారు. ఈ కొత్త క్యాంపస్ ను జూన్ రెండున ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అలాగే, 2013–14 ఫైనాన్షియల్ ఇయర్ లో దాదాపు రూ. 57వేల కోట్ల విలువ చేసే సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్స్ జరిగాయని, ఈ ఏడాది దాదాపు 12 శాతం పెరుగుతుందని సింగ్ చెప్పారు.
0 comments:
Post a Comment